
మెంటాడ,: డెంగ్యూ వ్యాధిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తదిద్వారా సీజనల్ వ్యాధులతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధిని కూడా నివారించవచ్చని మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ లోక్ ప్రియా అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణ పై అవగాహన కల్పించడానికి మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తారని ఏడిస్ దోమలు పగటిపూట కుట్టడం వలన వెక్టార్ ద్వారా సంతానోత్పత్తి చేసే వైరల్ వ్యాధి అని డెంగ్యూ ప్రాణాత్మక వ్యాధని దీనిని తగు జాగ్రత్తలతో నివారించవచ్చని అన్నారు. పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతను పాటించడం వలన డెంగ్యూ దోమల అభివృద్ధిని నివారించవచ్చు అన్నారు. డెంగ్యూ జ్వరము వలన వచ్చే సూచనలు అధిక జ్వరం, తలనొప్పి, కాళ్లు కండరాల్లో నొప్పి ,దద్దుర్లు వంటి ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిస్తుందని మనిషిని బాగా బలహీన పరుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో దోమల నివారణకు చర్యలు తీసుకోండి డెంగ్యూ వ్యాధిని తరిమి కొట్టండి, ఆరోగ్యంగా జీవించండి అని నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. కల్పన, సిహెచ్ఓ సత్యనారాయణ యు.డి.సి స్వామి ల్యాబ్ టెక్నీషియన్ మన్మధరావు, హెచ్ వి జ్యోతి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.